గత రెండు మూడు రోజలుగా చిరంజీవి 150 సినిమా గురించి కొత్త రకం వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతుందనుకొన్న ఈ సినిమాకు డైరెక్టర్ మారిపోయాడని పూరీ బదులు వినాయక్ తెరపైకి వచ్చాడనే ప్రచారం జరిగింది. నితిన్ తో పూరీ సినిమా రద్దుకావడం.. ఆ వెంటనే అతడు వరుణ్ తేజ్ సినిమాతో బిజీ అయిపోతుండటంతో. .చిరంజీవితో పూరీ సినిమా ఉంటుందా? ఉండదా? అనేది సందేహంగా మారింది.
అయితే ఈ సందేహాన్ని స్వయంగా పూరీనే నివృతి చేశాడు. చిరంజీవితో సినిమా ఖాయమైందనేందుకు రుజువులు చూపించాడు. తను మెగాస్టార్ కు కథ వివరించానని.. తొలి సగం కథను విని మెగాస్టార్ బాగా ఎంజాయ్ చేశాడని, ఎగ్జైట్ అయ్యాడని పూరీ ఫేస్ బుక్ లో వివరించాడు.
మరి చిరంజీవి, పూరీల కాంబినేషన్ లో సినిమా రాబోతోందనేదానికి ఇంతకన్నా రుజువు వేరే అవసరం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం కూడా ఖాయమైందని తెలుస్తోంది. చెర్రీ నిర్మాణంలో పూరీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందనమాట!