తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తరవాత ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ ఎక్కడా ఉండాలనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకరు రాజధాని అమరావతి అంటుంటే మరొకరు విశాఖపట్టణం అని అంటున్నారు. అయితే విజయవాడ, గుంటూరు మధ్య ఇంకా రాజధాని నిర్మాణ పనులు ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరవాతి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమను కూడా అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే భవిష్యత్ దృష్ట్యా మూవీ మొఘల్ రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్బాబు అమరావతిలో స్టూడియో కట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సినిమా పరిశ్రమకు విశాఖ ఎప్పటినుంచో అనుకూలమైన నగరం. సినిమా షూటింగులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సమీపంలో అరకు లోయ పరిసర ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇవన్నీ సినిమా రూపొందించడానికి ప్లసయ్యే ప్రాంతాలు. అందుకే అక్కడ రామానాయుడు స్టూడియో ఏర్పాటు చేశారు.
ఇక భవిష్యత్లో అభివృద్ధి చెందుతున్న ఆశతో స్టూడియో నిర్మిస్తే బాగుంటుంది.. అన్నీ అవకాశాలు తమకే వచ్చేలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఏర్పాటు విశాఖపట్టణంలోనా… అమరవాతి సమీపంలోనా ఇంకా నిర్ణయించలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా రాజధాని నిర్మాణం సక్రమంగా పూర్తి కాకపోవడంతో ఆల్రెడీ విశాఖ మంచి నగరంగా, ఉక్కు నగరంగా పేరొందింది. పైగా అక్కడ అన్నీ అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమరావతిలో సినీ పరిశ్రమకు ఒకే చెబితే అనే ఆలోచనతో ఇప్పడే అక్కడ ఒకటి స్టూడియో కట్టేస్తే పోలా అని సురేశ్బాబు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అందరి కన్నా ముందే స్టూడియో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం భూమి ఇస్తే తన తండ్రి రామానాయుడు కట్టిన విధంగా అమరావతిలోనూ స్టూడియో కడదామని ఆలోచన.
https://www.youtube.com/watch?v=jnD2E4YG9Uw