Sunday, April 28, 2024
- Advertisement -

తెలుగు హీరోలు ‘నో’ చెప్పినా.. తమిళ హీరో ‘ఎస్’ చెప్పి ఆ డైరెక్టర్ సత్తా ఏంటో గుర్తించాడు..!

- Advertisement -

శేఖర్ కమ్ముల.. ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్. ఇది తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు కూడా. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్ని విభాగాల్లోనూ ఆయనకు పట్టుంది. శేఖర్ క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ తోనే శేఖర్ కమ్ముల ఎన్నో అవార్డులు సాధించాడు. అయితే ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన చిన్న సినిమా ఆనంద్ పెద్ద విజయం అందుకుంది.

నిజానికి శేఖర్ కమ్ముల ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ ను దృష్టిలో ఉంచుకుని రాసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. అయితే తనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదని, అందుకే ఆయనకు ఆనంద్ కథ వినిపించే లేక పోయానని పలుసార్లు ఆయన వెల్లడించాడు. పవన్ కళ్యాణే కాదు మహేష్ బాబును పలు సార్లు శేఖర్ కమ్ముల కలిసి కథలు వినిపించాడు. అవేమీ ఆయనకు నచ్చలేదు.

Also Read: మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్..

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫిదా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ కథను ముందుగా శేఖర్ కమ్ముల మహేష్ బాబుకు వినిపించారట. ఆయనకు నచ్చక పోవడంతో, తర్వాత మరో అగ్ర హీరో రామ్ చరణ్ ను కలిసి ఫిదా కథ వినిపించాడు. ఈ కథ బాగున్నా తనకు సూట్ అవ్వదని రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించాడు. తన తమ్ముడు వరుణ్ తేజ్ కు అయితే ఈ సినిమా సూట్ అవుతుందని సజెస్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ ను కలవడం, ఆయనకు కథ నచ్చి సినిమా తీయడం అది సూపర్ హిట్ కావడం తెలిసిందే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. గోదావరి, ఆనంద్ క్లాసికల్ సినిమాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఒక రాజకీయ కథను కూడా ఇంత చక్కగా తీయొచ్చా అని లీడర్ సినిమాతో ఆయన నిరూపించారు. ఈ సినిమాలన్నీ శేఖర్ కమ్ముల ప్రతిభను చాటుతాయి. ఇంత మంచి సినిమాలు తీసి 20ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న శేఖర్ కమ్ములను టాలీవుడ్ ఇండస్ట్రీ అగ్ర హీరోలేవరూ ప్రోత్సహించలేదు. తమ సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇవ్వలేదు.

Also Read: ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఓ అగ్ర హీరో శేఖర్ కమ్ములకు ఛాన్స్ ఇచ్చాడు. ఆయన మరెవరో కాదు.. ఇప్పటికే తన నటనతో రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్న తమిళ అగ్ర హీరో ధనుష్. శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్నట్లు నిన్న అఫీషియల్ గా ప్రకటించారు. ధనుష్ ఇప్పటికే సహజ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. శేఖర్ కమ్ముల సినిమాలు కూడా ఎంతో సహజంగా సాగుతాయి. వీరిద్దరి కలయికలో సినిమా ప్రకటించగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మన తెలుగు అగ్రహీరోలు శేఖర్ కమ్ముల అవకాశం ఇవ్వకపోయినా, తమిళ అగ్ర హీరో ఆయన ప్రతిభను గుర్తించడం పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: సూపర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టిన యువ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -