- Advertisement -
ఇన్నాళ్ళూ రాజకీయాలలో బిజీ గా ఉన్న హీరో చిరంజీవి తన కొత్త సినిమా , కం బ్యాక్ సినిమా మొదలు పెట్టగానే యమా బిజీ అయిపోయారు. ఆగస్ట్ 22 న ఆయన పుట్టిన రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలి అనే ఉద్దేశ్యం తో చిరంజీవి యువత చాలా హడావిడి చేస్తున్నారు.
ప్రత్యెక పూజలు కూడా నిర్వహించడం కోసం వారు సిద్దం అయ్యారు. అందులో భాగాంగా ఈరోజు అంతర్వేదిలో జరగబోయే పూజా కార్యక్రమాలకు, వేడుకలకు మెగా ఫ్యామిలీ నుండి ‘సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్’ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు అభిమానాలు.
తేజ్ కూడా వారి ఆహ్వానాన్ని స్వీకరించి చిరంజీవి కోసం ప్రస్తుతం చేస్తున్న ‘నక్షత్రం’ సినిమా షూటింగ్ సైతం వాయిదా వేసుకుని మరీ ఆ కార్యక్రమానికి హాజరుకానున్నాడు. ‘కృష్ణ వంశీ’ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధరమ్ తేజ్ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మెప్పించనున్న సంగతి తెలిసిందే.
Related