టాలీవుడ్ లో తిరుగులేని మేటి , స్పీడున్న డైరెక్టర్ గా పేరున్న పూరీ జగన్నాథ్ కి ఇప్పుడు ప్లాపులు వెక్కిరిస్తూ ఉన్నాయి. టెంపర్ తరవాత జ్యోతి లక్ష్మీ – లోఫర్ సినిమాలు పూరీ కి విసుగు తెప్పించేసాయి. కేవలం తొంభై అంటే తొంభై రోజుల్లో సినిమాని పూర్తి చేసిన ఘనత పూరీ కి మాత్రమే దక్కుతుంది యావత్ ఇండస్ట్రీ లో.
ఈ స్పీడు అవసరం అయినప్పుడు మాత్రమే వాడాలి తప్ప ఎప్పుడూ పనికిరాదు అని నిరూపించాయి ఈ ప్లాపులు. లోఫర్ సినిమా మొదటి కాపీ విడుదల అయిన రెండో రోజే రోగ్ అనే తన కొత్త సినిమా షూటింగ్ కి బ్యాంకాక్ వెళ్ళిపోయాడు మనోడు. లోఫర్ కి తద్వారా ప్రమోషన్ తగ్గింది, రిలీజ్ కు రెండు రోజుల ముందు ఇక్కడకొచ్చి ప్రమోషన్లు మొదలెట్టాడు.
అంతే కాదు.. మళ్ళీ రిలీజ్ అయిపోగానే రోగ్ పనుల్లో బిజీ అయిపోయాడట. అసలు ఈ విధంగా చేస్తుంటే.. లోఫర్ సినిమా ఎందుకు ఆడట్లేదు.. జనాలకు ఎందుకు నచ్చట్లేదు.. అనే రీజన్లను మనోడు బేరీజు వేసుకొనేదెప్పుడు? సినిమాకు సినిమాకూ మధ్యన రాజమౌళి మహేష్ వంటి స్టార్లు ఫ్యామిలీ వెకేషన్ పేరుతో గ్యాప్ తీసుకునేది సరదాగా కాదు. జరిగిన తప్పొప్పులను అంచనాలు వేసుకోవడానికే. సరిగ్గా పూరి కూడా గ్యాప్ తీసుకొని అలా చేస్తే బెటరేమో.