Friday, May 3, 2024
- Advertisement -

పూరీ కోసం త్యాగం చేసిన దిల్ రాజు

- Advertisement -

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఈ మధ్య పోకిరి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ తో జన గణ మన అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. అయితే అసలు ఆ టైటిల్ రిజిస్టర్ చేయించింది నిర్మాత దిల్ రాజు. ఒకవేళ పూరి, దిల్ రాజు కాంబినేషన్ లో ఈ సినిమా ఉంటుందా అంటే కాదు పూరి అడగగానే తాను ఇచ్చేశానని చెబుతున్నాడు దిల్ రాజు.

ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న పూరి కళ్యాణ్ రాం తో రీమిక్స్ సినిమా చేస్తున్నాడు.అయితే అప్పట్లో చార్మి నిర్మాతగా జన గణ మన ఉంటుంది అన్న రూమర్లు కూడా వచ్చాయి. ఆ విషయాలన్ని తనకు తెలియదు కాని పూరి అడిగాడు కాబట్టే తాను టైటిల్ ఇచ్చేశాను అని చెప్పేశాడు దిల్ రాజు.

రీసెంట్ గా తన ప్రొడక్షన్ లో వచ్చిన సుప్రీం సినిమా హిట్ సాదించడంతో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని వ్యక్తపరిచాడు. మరి పూరి మహేష్ జన గణ మన ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -