Sunday, April 28, 2024
- Advertisement -

తాప్సి సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు.. కారణం?

- Advertisement -

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల హవా నడుస్తోందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు జీవిత కథ ఆధారంగా ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లు జీవిత కథ ఆధారంగా ఇప్పటివరకు ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ, సచిన్ బయోపిక్ ‘సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్’ చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే మహిళా క్రికెట్ జట్టులో స్టార్ క్రికెటర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మిథాలీరాజ్ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ బయోపిక్ కి  ‘శభాష్ మిథు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించనుండగా ఈ సినిమాకి రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి దర్శకుడు రాహుల్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also read:కమ్మటి రుచిని ఇచ్చే టమోటా రసం.. ఎలా చేయాలంటే?

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కరోనా కారణం వల్ల నా షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా ప్రభావంతో నేను ముందుగా అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారు కావడం వల్లే ఎంతో అద్భుతమైన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వస్తుందని రాహుల్ తెలిపారు.ఈ విధంగా ‘శభాష్ మిథు’ నుంచి దర్శకుడు రాహుల్ తప్పుకోవడంతో ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం శ్రీజిత్ కి వచ్చిందని చెప్పవచ్చు. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడం కోసం తాప్సీ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు.

Also read:పిల్లల అద్భుత ఆరోగ్యానికి సూపర్ టిప్స్ ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -