Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రముఖ దర్శకుడు శంకర్ కి మాతృవియోగం…!

- Advertisement -

తమిళ ఇండస్ట్రీలో ఈ మద్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ముత్తులక్ష్మి (86) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శంకర్‌కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అనేక ఇంటర్వ్యూల్లో తల్లిని గుర్తుచేసుకున్న శంకర్ తాను ఈ స్థాయికి రావడానికి తల్లి ముత్తులక్ష్మి కారణమని, ఎన్నో కష్టాలుపడి ఆమె తనను పెంచారని గొప్పగా చెప్పేవారు.

ఇప్పటికే కరోనా కారణంగా తమిళ సినీ పరిశ్రమ అనేకమందిని కోల్పోయింది. ఇలాంటి తరుణంలో శంకర్ తల్లిని కోల్పోవడం మరింత బాధాకరం అంటున్నారు తమిళ సినీ పెద్దలు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు శంకర్.

తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో ఆయనకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ షూటింగ్ రీస్టార్ట్ చేసే పనిలో ఉన్న శంకర్ ఇటీవలే రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ సినిమాలను ఓకే చేసుకున్నారు.

కరోనా విషయంలో సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!

రేపు ‘ఆర్ ఆర్ఆర్’నుంచి కొమురం భీం ఉగ్రరూపం విడుదల..

నటుడు విజయకాంత్ కు అస్వస్థత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -