Friday, May 3, 2024
- Advertisement -

మ‌ళ్లీ రానానే దిక్కు

- Advertisement -

ద‌ర్శ‌కుడు తేజ‌కు బ్యాడ్‌టైం న‌డుస్తుంది.నేనే రాజు నేనే మంత్రి లాంటి హిట్ కొట్టిన, ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగానే ఉన్నాడు. మ‌ధ్య‌లో రెండు మూడు సినిమాల‌ను లైన్లో పెట్టిన అవి వ‌ర్క్ అవుట్ కాలేదు.ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో హీరో బాల‌కృష్ణ‌కు తేజ‌కు మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చి సినిమా నుండి స‌డ‌న్‌గా బ‌య‌టికి వ‌చ్చేశాడు.అలాగే మ‌రో సీనియ‌ర్ హీరో కెంక‌టేష్‌తో సినిమా ప్లాన్ చేశాడు తేజ‌.

ఈ సినిమా సురేష్ బాబు నిర్మాత‌గా ఉన్నాడు.ఎన్టీఆర్ బయోపిక్‌లో న‌టి శ్రీరెడ్డిని తీసుకొవడం…..శ్రీరెడ్డి సురేష్ బాబు కొడుకు అభిరాంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం,ఈ సినిమా నుండి తేజ‌ని తీసేయ‌డం అన్నీ చ‌కా చ‌కా జ‌రిగిపొయ్యాయి. తేజ ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నాడు.ఈ నేపథ్యంలోనే నాగార్జునతో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడనే టాక్ వచ్చింది. ఇక తాజాగా రానా పేరు తెరపైకి వచ్చింది. యుద్ధం నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు.

ఈ సినిమాలో రానా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఈ స్టోరీకి రానా అయితే బాగుండ‌ని తేజ న‌మ్మ‌కం.మ‌రి ఈ సినిమాను రానా ఒప్పుకుంటాడా అనేది ఇక్క‌డ స‌మ‌స్య‌.మ‌రి తేజ కాంబినేషన్లో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -