దిశా పఠానీ వీహీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో పరిచియమైన ఫేమస్ అయింది మాత్రం బాలీవుడ్లోనే.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాతో హీరోయిన్గా పరిచియమైంది దిశా పఠాని.ఈ సినిమా మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా చేశాడు. కాని ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు.దీంతో దిశాకు తెలుగులో అవకాశాలు రాలేదు.ఇక చేసేది లేక అవకాశాలు కోసం బాలీవుడ్కు వెళ్లింది.అక్కడ ఈ అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి.అక్కడ ఈ భామకు టైగర్ ష్రాఫ్ బాగానే సపోర్టు చేశాడు.తన పక్కన హీరోయిన్గా రెండు సినిమాలలో అవకాశాలు కుడా ఇచ్చాడు.హీరోయిన్గా రికమండేషన్ కుడా చేస్తున్నాడు టైగర్ ష్రాఫ్.వీరిద్దరు కలిసి నటించిన భాగీ-2 బాక్స్ఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది.హిట్ సాధించిన ఆనందంలో తన కేరీర్ మొదట్లో ఎన్నీ కష్టాలు పడిందో మీడియాకు వివరించింది.
మీడియాతో మాట్లాడుతూ… ‘నేను బ్యాక్గ్రౌండ్తో రాలేదు. నాకు నటన అంటే చాలా ఇష్టం. నేను మొదటిసారిగా ముంబైకి వచ్చినప్పుడు నా చేతిలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎన్నో ఆడిషన్స్కు వెళ్లాను. ఒకనాకొ సమయంలో ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి కూడా వచ్చింది. ఒక అమ్మాయి.. ఎవరూ తెలియని నగరానికి వచ్చి బతకడం ఎంతో కష్టం’ అంటూ తన జ్ఞాపకాలను పంచుకుంది.