Monday, May 6, 2024
- Advertisement -

రికార్డ్ క్రియేట్ చేసిన దృశ్యం 2.. ఎందులో అంటే?

- Advertisement -

బ్లాక్ బాస్టర్ హిట్ మలయాళ చిత్రాలు ‘దృశ్యం, దృశ్యం 2’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్‌. మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ విభిన్నమైన థ్రిల్లర్‌మూవీ ‘దృశ్యం 2’ ఫిబ్రవరి 19న అమెజాన్‌లో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు దర్శకుడు జీతూ జోసెఫ్‌ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

తాజాగా ‘దృశ్యం 2’ సినిమా స‌రికొత్త రికార్డ్ సాధించి వార్త‌ల‌లోకి ఎక్కింది. ఐఎండీబీ లెక్క‌ల ప్ర‌కారం ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధిక రేటింగ్ సాధించిన భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులు,ఇంకా అంతర్జాతీయ ప్రేక్షకులు ఇలా అన్నింటిని లెక్కలు కడితే 8.8 రేటింగ్‌తో ఈ మూవీ దూసుకుపోయింది. ఈ మూవీలో మలయాళీ అగ్రహీరో మోహన్ లాల్, మీనా జంటగా నటించారు.

Also read:ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!

విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే చెప్పుకోదగ్గ మూవీల్లో “దృశ్యం” మూవీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.తెలుగులో సూపర్ హిట్ కాంబినేషన్‌గా పేరుగాంచిన విక్టరీ వెంకటేష్, సహజ నటి మీనా జంటగా 2014 లో విడుదలైన ‘దృశ్యం’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఈ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ మళ్లీ మరోసారి’దృశ్యం ‘ సీక్వెల్‌గా వస్తున్న ‘దృశ్యం 2’ మూవీలో నటిస్తున్నారు.

Also read:టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -