Friday, March 29, 2024
- Advertisement -

టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!

- Advertisement -

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ప్రముఖ పాపులర్ కథానాయకుడు జాబితాలో మన టాలీవుడ్ హీరోలు తమ సత్తాను చాటుకున్నారు. భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుని ఇటువంటి పోటీలలో స్థానం సంపాదించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. అయితే 2020 సంవత్సరానికి గాను పాపులర్ యువ కథానాయకుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో యువ హీరో నాగ శౌర్య ప్రత్యేకమైన స్థానం లభించింది.

హైదరాబాద్ టైమ్స్ ప్రకటించిన ఈ జాబితాలో నాగశౌర్య ఐదవ స్థానాన్ని దక్కించకోగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.2019వ సంవత్సరంలో 19వ స్థానానికి పరిమితమైన ఎన్టీఆర్ ఈ ఏడాది మూడో స్థానానికి చేరుకున్నాడు. అదేవిధంగా ఈ క్రమంలోనే హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన జాబితాలో రెండవ స్థానాన్ని ఎనర్జిటిక్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకోగా,నాలుగవ స్థానాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ దక్కించుకున్నారు.

Also read:ఆ దర్శకుడి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ కర్ణన్ రీమేక్?

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో నిలిచాడు.ఈ విధంగా 2020 కథానాయకుడు జాబితాలో విజయ్ దేవరకొండ మొదటి స్థానం దక్కించుకోవడం పట్ల ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Also read:ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -