మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో హీరోకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్కి కూడా అంతే ప్రాధన్యత ఉంటుంది.ఈ విషయం త్రివిక్రమ్ గత సినిమాలను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.ఆ భావనతోనే త్రివిక్రమ్తో సినిమా పైగా ఎన్టీఆర్ హీరో అనగానే ఎగిరి గంతెసి మరి అరవింద సమేత సినిమా ఒప్పుకుంది హీరోయిన్ ఈషా రెబ్బా.సెకండ్ హీరోయిన్ అయిన క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాను అంగీకరించింది ఈషా.కానీ సినిమాలో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు దర్శకుడు త్రివిక్రమ్. ఆమె ఉన్న సీన్లు కూడా ఏదో పెట్టాలని పెట్టినట్లుగానే ఉన్నాయి.
ఒక్క పాట కూడా ఇవ్వలేదని కోరడంతో ‘పెనిమిటి’ పాటలో రెండు షాట్లు వేసి సరిపెట్టారు.ఆ పాటకి ముందు ఆమె చెప్పే డైలాగులు కూడా కథకి సింక్ అవ్వవు. దీంతో ఆమె పాత్రని ఇరికిన్చినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమా తరువాత తన క్రేజ్ పెరిగిపోతుందని భావించిన ఈషాకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.దీంతో త్రివిక్రమ్ తనను మోసం చేశాడని తెలిసిన వాళ్ల దగ్గర వావుపోతుందట.పైగా ఈ సినిమా కోసం రెండు చిన్న సినిమాలను కూడా ఈషా రెబ్బా వదులుకుందని సమాచారం.