ఎవరూ దక్కించుకోనన్నీ నంది అవార్డులను ప్రిన్స్ మహేశ్బాబు దక్కించుకుంటున్నాడు. వ్యక్తిగత ఖాతాల్లో నంది అవార్డులు ఎక్కువగా వేసుకున్న హీరోగా మహేశ్బాబు నిలుస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో ‘అతడు’ మళ్లీ ఉత్తమ నటుడిగా నంది బహుమతి పొందాడు.
నటనాపరంగా అవార్డులు మహేశ్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాయి. మంచి క్లాసీ హిట్గా, ప్రజలకు మంచి సందేశం ఇచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాకు 2015 ఉత్తమ నటుడిగా నంది అవార్డు పొందాడు. ఇది మహేష్ కెరీర్లో ఎనిమిదో నంది అవార్డు కావడం విశేషం. తన తొలి సినిమా రాజకుమారుడు (1999)తోనే నంది అవార్డును దక్కించుకున్నాడు.
తన సమకాలికుల్లో ఎనిమిది నంది అవార్డులను పొందిన ఏకైక హీరోగా మహేశ్ నిలుస్తున్నాడు. ఈ విధంగా మహేశ్బాబు అష్టనందులను అందుకున్నాడు. తమ అభిమాన నటుడికి అవార్డులు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల స్పైడర్ సినిమాతో ఆకట్టుకున్న మహేశ్బాబు మరో ప్రాజెక్టు పనిలో ఉన్నారు.
1999 రాజకుమారుడు
2001 మురారి
2002 టక్కరి దొంగ
2003 నిజం
2004 అర్జున్
2005 అతడు
2016 దూకుడు