Saturday, May 4, 2024
- Advertisement -

శ్రీనువైట్ల‌తో మాస్ మ‌హారాజ సినిమా షురూ

- Advertisement -

‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ సినిమా సెట్స్‌పైకి

సినిమాలు చేస్తున్నా గ‌తంలో మాదిరి ఇప్పుడు క‌లిసి రావ‌డం లేదు. ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందిన వ్య‌క్తి ఇప్పుడు ఆయ‌న పేరు ఎక్క‌డా వినిపించ‌డం లేదు. వ‌రుస ప‌రాజ‌యాలు పొందిన ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల వాటి నుంచి కోలుకొని కొత్త సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. మాస్ మాహారాజ రవితేజతో క‌లిసి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమాను ప్రారంభించాడు. గురువారం (మార్చి 8) తేదీన హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. గతంలో శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’ సినిమాలు వ‌చ్చాయి. ఆ సినిమాలు శ్రీనువైట్ల‌కు, ర‌వితేజ‌కు మంచి సక్సెస్‌ సాధించాయి. ఈ నేపథ్యంలో మూడోసారి వీరి కాంబినేష‌న్ రిపీట‌వడంతో ఈ సినిమా హిట్ ప‌క్కా అని ధీమాతో ఉన్నారు.

ఈ సినిమాలో రవితేజ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అందుకే అమ‌ర్‌, అక్బ‌ర్‌, ఆంటోని అనే ముగ్గురు పాత్ర‌ల్లో ర‌విజేత క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాలో రవితేజ ప‌క్క‌న అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్‌ సంగీత అందిస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా ఫెయిలైన హాస్య న‌టుడు సునీల్ కీలక పాత్రలో న‌టించ‌నున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -