Wednesday, May 8, 2024
- Advertisement -

నా భార్య గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు : అనుపమ్ ఖేర్

- Advertisement -

ఈ మద్య సోషల్ మీడియాలో ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటున్నట్లుంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో కొంత మంది సెలబ్రెటీలు చనిపోయారు అంటూ ప్రచారాలు రావడం.. స్వయంగా వారే ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ వార్తలపై స్పందించిన అనుపమ్ ఖేర్ తన భార్య గురించి అవాస్తవాలు ప్రచారమవుతున్నాయని చెప్పారు. అందులో నిజం లేదని… ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకు వస్తాయో అర్థం కాదని.. ప్రస్తుతం కరోనా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ వార్త తన అభిమానులను కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యాహ్నం ఆమె కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా వేయించుకున్నారని చెప్పారు. ఇలాంటి కట్టు కథనాలను ప్రచారం చేయవద్దని విన్నవించారు. దయచేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఇంటి వద్దనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అభిమానులను కోరారు.

పెళ్లిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఛార్మి.. వరుడు ఎవరో తెలుసా?

కరోనా భారిన పడ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..

క‌డ‌ప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -