Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో సాయిపల్లవి ఫ్రెండ్

- Advertisement -

బిగ్ బాస్ హడావుడి మొదలయింది. నాగార్జున అక్కినేని మూడో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి ఈ షో మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇక షో నిర్వాహకులు కూడా ఈ విషయాన్ని నిన్న అధికారికం గా ప్రకటించారు. ఇక అందరి దృష్టి ఈ షో లో పాల్గొనే 16 కంటెస్టెంట్స్ మీద ఉంది. కాకపోతే ఈ షో లో ఉండే ఆ 16 మంది ఎవరు అనే విషయం మాత్రం ఇంకా తెలియదు. మీడియా లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

రేణు దేశాయ్, లాస్య, జ్వాలా గుత్తా ఉన్నారు అని రూమర్స్ వచ్చాయి కానీ వాళ్ళు షో లో పాల్గొనడం లేదు అని తేల్చి చెప్పారు. రాహుల్ సిప్లిగూంజ్ అనే సింగర్ ఈ షో లో ఉన్నట్టు ఇప్పటికే మాకు సమాచారం అందింది. ఇకపోతే ఫిదా సినిమా లో సాయి పల్లవి కి ఫ్రెండ్ గా నటించిన గాయత్రి గుప్తా అనే నటి ఈ షో లో పాల్గొనబోతుందట. ఇటీవలే ఈ షో కి సంబందించిన అగ్రిమెంట్ ని కూడా గాయత్రి చేసుకుంది అని సమాచారం.

అప్పట్లో శ్రీ రెడ్డి మీ టూ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు గాయత్రి కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -