ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టింది మళయాళ బ్యూటీ రష్మిక.మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది ఈ భామ.రష్మిక పేరు చెబితే అందరు అమ్మో ఆమె అల్లరి పిల్ల అని తెల్చేస్తారు.ఇక విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది రష్మిక. గీతా గోవిందంలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఈ సినిమా షూటింగ్లో జరిగిన ఓ సంఘటనను మీడియాతో పంచుకుంది రష్మిక. గీతగోవిందం షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ తనను ఆటపట్టించిన విషయాన్ని ఈ సందర్భంగా రష్మిక పంచుకుంది.ఓసారి గీతగోవిందం షూటింగ్ స్పాట్ కు వెళ్లడం కొంచెం ఆలస్యం అయిందని రష్మిక తెలిపింది.
‘‘నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే చాలా ఇబ్బంది పడిపోతా. ఆరోజు షూటింగ్ స్పాట్ కు కొంచెం ఆలస్యంగా వెళ్లడంతో సెట్ లో ఎవ్వరూ నాతో మాట్లాడలేదు. నేను పలకరించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో నేను ఓ చోట కూర్చుని ఏడ్చేశా. వెంటనే దర్శకుడు పరశురామ్ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘నిన్ను ఆటపట్టించడానికే ఇదంతా చేశాం’ అంటూ ఓదార్చారు. అప్పటివరకూ నన్ను ఫాలో అవుతున్న కెమెరాను పరశురామ్ చూపించారు. అసలు నన్ను ఓ కెమెరా ఫాలో అవుతుందని అప్పటివరకూ నాకు తెలియలేదు’’ అని ఈ ఘటనను రష్మిక గుర్తుచేసుకుంది.