- Advertisement -
సూపర్ స్టార్ మహేశ్తో మూవీ తీయాలని ప్రతి నిర్మాత కోరుకుంటాడు. ఇప్పడు అదే జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ మహేశ్తో మూవీ తీయాలని ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. సాధారణంగా మెగా హీరోలతో మాత్రమే సినిమాలు చేసే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, ఈ మధ్య మీడియం బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. మహేశ్, అల్లు అరవింద్ ఈ మధ్య ఓ ఫంక్షన్లో కలుసుకున్నారట!
మహేశ్తో మూవీ చేయాలనే ఉద్దేశ్యాన్ని అల్లు అరవింద్ వెలిబుచ్చారట. దీనికి మహేష్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు చెబుతున్నారు. సరైన కథ దొరికితే సినిమా పట్టాలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మహేశ్ ప్రస్తుతం తన 25వ సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. పూజాహెగ్డె హీరోయిన్గా నటిస్తుంది.