అలనాటి నటి జీవిత కథను మహనటి సినిమాగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పొషిచింది.గత వారం రీలిజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతుంది.సినిమాకు కలెక్షన్లు కూడా అదే విధాంగా ఉన్నాయి.సినిమాపై విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి.సినిమాపై ఒకరు కూడా నెగిటివ్ కామెంట్ చేయలేదు.ఇటువంటి సందర్భంలోనే బయటికి వచ్చి సినిమాపై ఫైర్ అయ్యారు జెమిని గణేశన్ మొదటి భార్య కుమార్తె కమలాసెల్వరాజ్.
సినిమాలో జెమిని గణేశన్ పాత్రను చెడుగా చూపించారని,నాన్నకు అవకాశాలు ఎప్పుడు తగ్గలేదని కాని సినిమాలో ప్రేక్షకులు నాన్నను తిరస్కరించారని చూపించారని మండిపడింది.అలాగే అభిమానులు నాన్నను ప్రేమగా కాదల్మన్నన్ ( ప్రేమరాజు) అని పిలుచుకునేవారని కమలాసెల్వరాజ్ తెలిపారు.పెళ్లి అయి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా సావిత్రి నాన్నను పెళ్లి చేసుకుందని, నాన్న కోరికను మేము ఎప్పుడు వ్యతిరేకించలేదని తెలిపింది.సినిమాలో సావిత్రికి మద్యం అలవాటు చేసింది నాన్నే అనేలా చూపించారని అది చాలా తప్పు అని అన్నారు కమలా సెల్వరాజ్.
నాన్న గురించి చెప్పాలంటే తనను ప్రేమించిన వారినే ఆయన పెళ్లి చేసుకున్నారని, పెళ్లయిన వారినెవరిని ఆయన చెడగొట్టలేదని అన్నారు.నేను నాన్న సావిత్రిగారి ఇంటికి వెళ్లితే తమపై కుక్కని వదిలి గెంటేసింది అని అప్పటి నుండి నాన్న ఆమె ఇంటికి వెళ్లటం మానేశారని సినిమాలో నాన్న గురించి చాలా తప్పుగా చూపించారని భాదపడ్డారు జెమిని గణేశన్ మొదటి భార్య కుమార్తె కమలాసెల్వరాజ్.