Thursday, April 25, 2024
- Advertisement -

ముంబాయిలో ఇల్లు కొన్న కన్నడ బ్యూటీ!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన. ఛలో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కన్నడ బ్యూటీ తర్వాత గీతాగోవిందం చిత్రం బాక్సాఫీస్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుస విజయాలు సాధించాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప చిత్రంలో నటిస్తుంది. తెలుగులో దూసుకుపోతూ కూడా కన్నడ సినిమాలను కూడా సమానంగా బ్యాలెన్స్‌ చేస్తున్న ఈ క్యూటీ ఈ మధ్యే ‘మిషన్‌ మజ్ను’తో బాలీవుడ్‌లోకి తన హావా చాటాలి అని బాలీవుడ్ లోకి ప్రవేశించింది.

ఈ ముద్దుగుమ్మ ఏ భాషైనా, ఏ సినిమా అయినా ఆగేది లేదంటూ యమ స్పీడుగా సినిమాలు చేస్తోంది.ప్రస్తుతం రష్మిక స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. ఇందులో ఆమె చిత్తూరు యాసలో మాట్లాడే పల్లెటూరి యువతిలా కనిపించనుంది. ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో శర్వానంద్‌తో జోడీ కడుతోంది. అలాగే మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మికను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

క్షణం తీరిక లేకుండా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. దీంతో మొన్నామధ్య లగ్జరీ కారు కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ఓ ఇల్లు కూడా కొందట.హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’తో పాటు అమితాబ్‌ బచ్చన్‌ తో ‘డాడీ’ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో? లేదో ? ఇలా తెలుసుకోండి !

‘పెళ్లి సందడి 2’ లో దర్శకేంద్రుడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -