ఈ మధ్య గోపిచంద్ చిత్రాలు బాగా లేట్ అవుతున్నాయి. నిర్మాతల నుంచి సమస్యనో లేక దర్సకుల నుంచి సమస్యనో తెలియదు కానీ సినిమాలు మాత్రం తొందరగా కంప్లీట్ కావడం లేదు. తాజా గోపిచంద్ నటించిన ఆక్సిజన్ చిత్రం కూడా కొంత లేట్ అయిన షూటింగ్ మాత్రం పూర్తి చేసుకుంది.
రాశీ ఖన్నా, మజ్ను ఫేం ఎమ్మాన్యుయెల్ గోపిచంద్ సరసన నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు. ఎ.ఎం.జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్కు మంచి స్పందన రాగా.. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా సినిమా నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. ముంబై.. గోవా.. సిక్కిం.. చెన్నై తదితర ప్రదేశాల్లో రాజీపడకుండా ఈ సినిమాని రూపొందించాం. యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతం అందించారు. జ్యోతికృష్ణ డైరెక్షన్ చాలా బాగుంటుంది. త్వరలోనే ఆడియోని రిలీజ్ చేసి తర్వాత సినిమా విడుదల డేట్ ను ప్రకటిస్తాం అని తెలిపారు.
Related