Monday, April 29, 2024
- Advertisement -

గులాబీ మూవీ నటి మహేశ్వరీ ఇప్పుడెలా ఉందంటే ?

- Advertisement -

నటి మహేశ్వరి.. గులాబీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గెలుచుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేసినా మహేశ్వరి.. రవితేజ హీరోగా వచ్చిన నీకోసం సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు గెలుచుకుంది.

నీకోసం సినిమా తర్వాత జె.డి.చక్రవర్తితో పలు సినిమాల్లో నటించిన మహేశ్వరికి తిరుమల తిరుపతి వెంకటేశ తెలుగు లో ఆఖరి చిత్రం. ఆ మూవీ తర్వాత తెలుగు మూవీస్ లో నటించలేదు. కానీ జీ తెలుగులో మై నేమ్ ఇస్ మంగతాయారు అనే కామెడీ బేస్ సీరియల్ తో ప్రేక్షకులను అలరించింది. ఆ సీరియల్ తర్వాత మహేశ్వరి సినిమా ఫంక్షన్స్ లో కాని బయట ఎక్కడా గానీ పెద్దగా కనిపించలేదు.

2008లో జై కృష్ణ తో మహేశ్వరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జై కృష్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మహేశ్వరి, జై కృష్ణలకు ఓ పాప ఉంది. ప్రస్తుతం మహేశ్వరి తన ఫ్యామిలీతో కలిసి చెన్నై లో హ్యాపీ ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -