ఛలో సినిమాతో డిసెంట్ హిట్ కొట్టాడు హీరో నాగశౌర్య. ఈ సినిమాకు ముందు నాగశౌర్యకు అన్ని ప్లాపులే పలకరించాయి.ఛలో హిట్తో మనోడికి కన్ఫిడెన్స్ కాస్తా ఎక్కువైనట్లు ఉంది.దీంతో నాగశౌర్య ఎవరి మాట వినడం లేదట.అతను తాజాగా నటిస్తున్న ‘నర్తనశాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇప్పటికే విడుదల అయిన టీజర్కు మంచి రెస్పన్స్ వచ్చింది.సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని, నచ్చకపోతే అసలు చూడద్దంటున్నాడు.
నచ్చితే మాత్రం సినిమా బాగుందని పది మందికి చెప్పి ప్రోత్సహించమని కోరాడు.స్టేజ్ ల మీద ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు సినిమా హిట్ అయితే ఓకే లేదంటే మాత్రం సోషల్ మీడియాలో వారు చెప్పిన స్టేట్మెంట్స్ ని గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేస్తుంటారు నెటిజన్లు. దీంతో ఛలో సినిమా తరువాత నాగశౌర్య మాటలు బాగానే నేర్చాడని,ఎవరిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.