Thursday, May 16, 2024
- Advertisement -

ప‌వ‌న్ రాజ‌కీయాల్లో మార్పు తెస్తాడంటున్న హీరో నితిన్

- Advertisement -

వేస‌విలో సినిమాల సంద‌డి మొద‌లయ్యింది. రంగస్థ‌లంతో మంచి బోణి కొట్టిన రామ్‌చ‌ర‌ణ్ ఆ త‌ర్వాత నితిన్ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. తాను కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టించిన సినిమా చ‌ల్ మోహ‌న్‌రంగ‌. ఆ సినిమా పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా నితిన్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంపై మాట్లాడాడు. త‌న‌కు త‌న తండ్రి తర్వాత ఇద్దరు వ్యక్తులను ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పాడు ఆ ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పేర్కొన్నాడు.

త‌న‌కు ఇష్ట‌మైన ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో కలిసి సినిమా చేయడం త‌న‌కు మరచిపోలేని అనుభూతి క‌లుగుతోంద‌ని నితిన్ ఆనందం వ్య‌క్తం చేశాడు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల గురించి మీడియా ప్ర‌శ్నించ‌గా స‌మాధానం ఇచ్చాడు. త‌నకు రాజకీయాల గురించి అంతగా తెలియదని చెప్పుకొస్తూ కానీ త‌న బాస్ పవన్ ఐడియాలజీ గురించి మాత్రం తెలుసు అని చెప్పాడు. రాజ‌కీయాల్లో మార్పు తీసుకురాగల సత్తా ఉన్న ఆలోచనలు తన దేవుడు పవన్ దగ్గర ఉన్నాయని నితిన్ కొనియాడాడు.

పవర్ స్టార్ తన సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం నమ్మలేకపోతున్నట్లు చెప్పాడు. చ‌ల్‌మోహ‌న్‌రంగ సినిమా కథ గురించి పవన్ వాకబు చేశారని.. త్రివిక్రమ్ కథ అందించారని చెప్పగా వెంటనే తాను ప్రొడ్యూస్ చేస్తానని ప‌వ‌న్ ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వం చేయాల్సి ఉండ‌గా త‌న బిజీ షెడ్యూల్ వ‌ల‌న ఆ అవ‌కాశం కృష్ణ చైతన్యకు ఇచ్చార‌ని తెర వెనుక జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను నితిన్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -