Thursday, May 16, 2024
- Advertisement -

హిమాలయాల్లో అమ‌లాపాల్

- Advertisement -
  • యాత్రను ఎంజాయ్ చేస్తున్న భామ‌

పెళ్లి త‌ర్వాత త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను మ‌ర‌చిపోయిన అమ‌లాపాల్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తోంది. మంచి అంద‌మైన ప్రాంతాల్లో విహారిస్తూ ఉత్సాహంగా గ‌డుపుతోంది. జమ్మూకశ్మీర్‌లో ఉన్న లడఖ్ టూర్‌కి ఇటీవ‌ల వెళ్లింది. అయితే ఒక్క‌తే వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. స్వేచ్ఛ అనేది ఒక ప‌రిమాణంలో ఉండ‌ద‌ని, అది మ‌న శ‌క్తిలోనే ఉంట‌ద‌ని పేర్కొంటూ ట్విట్ట‌ర్‌లో పేర్కొంటూ రెండు ఫొటోల‌ను పోస్ట్ చేసింది.

ఈ టూర్ ఓ మధురానుభూతి అని పేర్కొంటూ ట్వీట్లు చేస్తోంది. ప్రస్తుతం చ‌లికాలం కావ‌డంతో హిమ‌గిరుల్లో మ‌రింత అందాలు ఉంటాయి. అందుకే ఈ స‌మ‌యంలో మంచుకొండల్లో విహ‌రించేందుకు వాలిపోయింది. ఈ సీజన్ లో లడఖ్ మరింత అందంగా ఉంటుంది. ఆ అందాలను తన మదితో పాటు కెమెరాల్లో కూడా అమలాపాల్ బంధించేస్తోంది. ఫ్లైట్ దిగడానికి ముందు నుంచే సోషల్ మీడియాలో త‌న యాత్ర అప్‌డేట్స్ వెల్ల‌డిస్తోంది. దిగీ దిగగానే ఇక్కడ తెగ చలిగా ఉంది బేబీ అంటూ ఓ సెల్ఫీ ఫొటో పెట్టేసింది. ఓ ఎత్తైన ప్రాంతంలో ఉన్న శాంతి స్థూపం సందర్శించుకుంది.

యాత్ర ప్ర‌దేశాల్లో త‌న‌ను గుర్తు ప‌ట్టిన వాళ్ల‌తో ఫొటోలు దిగుతూ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. నచ్చిన ప్ర‌దేశాల‌ను ఫొటోలు దిగడం, రోడ్డుపై మైలురాళ్ల దగ్గర ఫొటోలు తీసుకుని ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుంటోంది. ఇంత‌కుముందు రాంచ‌ర‌ణ్‌తో శుభ‌లేఖ రాసుకున్న ఎప్పుడో అనే పాట‌లో హిమాల‌యాల్లో చిందులేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -