- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలితో వచ్చిన క్రేజ్ను ఈ సినిమాతో కొనసాగించాలని అనుకుంటున్నాడు ప్రభాస్. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ దొంగగా కనిపించనున్నాడు.
ఈ సినిమాలో రాబరీ సీన్లు సినిమాకు హైలెటగా నిలవనున్నాయాట.రాబరీ సీన్ ని హైటెక్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారట. ఇప్పటికే ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేసిన టీజర్కు సూపర్బ్ రెస్పన్స్ వచ్చింది.150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెకక్కుతున్న ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.