ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేపట్టిన భారత పర్యటన ముగిసింది. ఐదు రోజుల పాటు సాగిన ఆయన పర్యటన గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా గురువారం బాలీవుడ్ ప్రముఖులను కలిశారు. వారితో సమావేశమయ్యారు. ‘షాలోమ్ బాలీవుడ్’ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులతో పాటు చాలామంది సినీనటులు పాల్గొన్నారు.
‘ఇజ్రాయెల్, భారత్ మధ్య ఉన్న స్నేహాన్ని భారతీయులకు, ఇజ్రాయెల్ వాసులకు తెలియాలి. ఇదివరకు ఆస్కార్ అవార్డులో సెలబ్రిటీలు అంతా కలిసి సెల్ఫీ దిగినట్లు మనం కూడా ఓ ఫొటో దిగితే బాగుంటుంది. సెలబ్రిటీలు అందరూ నాతో సెల్ఫీ దిగడానికి రావాల్సిందిగా కోరాడు. మన స్నేహాన్ని కొన్ని కోట్ల మంది గుర్తించాలి’ అని నెతన్యాహు అడగడంతో బాలీవుడ్ ప్రముఖులంతా సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ట్వీట్ చేస్తూ నెతన్యాహు ‘తాను దిగిన బెస్ట్ సెల్ఫీ ఇది’ అని చెప్పారు. సెల్ఫీలో అమితాబ్ బచ్చన్, రణ్ధీర్ కపూర్, ఐశ్వర్యరాయ్, అభిషేక్, వివేక్ ఒబెరాయ్ తదితర నటులు, దర్శకులు తదితరులు ఉన్నారు.