భరత్ అనే నేను మూవీ బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడంతో మహేష్ పుల్ కుషీగా ఉన్నారు. సినిమా హిట్ అవ్వడంతో ఫ్యామీలీతో రిలాక్స్ అయ్యేందుకు పారీస్ చెక్కేశాడు భరత్. భార్యా పిల్లలతో కలసి పారిస్ వీధుల్లో షికార్లు కొడుతున్నాడు.
భరత్ అను నేను సినిమా అందరూ ఊహించినట్టుగానే మహేష్ ఖాతాలో మరో హిట్ ను జతచేర్చింది. ఆ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నించి విడుదలై హిట్ టాక్ వచ్చేదాకా చిత్రయూనిట్ కాస్త టెన్షన్ పడుతూనే ఉంది. ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో అంతా రిలాక్సయ్యారు.
పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నమ్రతా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఒక ఫోటోలో మహేష్ బాబు కూతురు సితారతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు. మరొక ఫోటోలో ఇద్దరు పిల్లలతో కలిసి సామాన్య వ్యక్తిలో పారిస్ వీధుల్లో షికారు చేస్తున్నాడు. ఈఫిల్ టవర్ దగ్గర తీయించుకున్న ఫోటోలను కూడా నమ్రతా షేర్ చేసింది. మహేష్ ఇప్పుడే కాదు గతంలో కూడా కుటుంబంతో కలిసి పారిస్కు వెళ్లాడు.
ఈ ఫోటోలు మహేష్ అభిమానులను కాస్త నిరాశపరిచాయి. ఎందుకంటే ఏ ఫోటోలోను మహేష్ ముఖం కనిపించడం లేదు. నమత్రా ఎక్కువగా పిల్లల ఫోటోలే పోస్టు చేసింది. తమ అభిమాన హీరో ఫోటోలను కూడా పోస్టు చేయమంటూ ఫ్యాన్స్ నమ్రతను కోరుతున్నారు.