Saturday, May 11, 2024
- Advertisement -

రష్మీ కథ కోర్టుకెక్కింది!

- Advertisement -

‘జబర్తస్’‌తో బాగా ఫాపులర్ అయిన యాంకర్ రష్మీ.. మొదట్లో సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు దాంతో యాంకర్‌గా స్టార్ట్ చేసి బాగా పేమస్ అయ్యింది. ప్రస్తుతం రష్మీ.. ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా చేస్తూ కొన్ని సినిమాలు కూడా చేస్తోంది. అయితే ప్రస్తుతం రష్మీ చారుశీల అనే చిత్రంలో నటించింది. ఇప్పుడు ఈ చిత్రం వల్ల రష్మీకి చాలా కష్టాలు వచ్చాయి. ఈ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై రష్మీ బారీగా ఆశలు పెట్టుకుంది. కానీ ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

చారుశీల సినిమా జూలీ గణపతి అనే సినిమాకి దగ్గరగా ఉందని… ఈ విషయమై న్యాయం కోసం నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. కాని ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ గతంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన జూలీ గణపతి మూవీ తమిళ్ డబ్బింగ్, రీమేక్ రైట్స్ తీసుకున్న విషయం విదితమే. ఈ సినిమాకి బాలు మహేంద్ర దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు. జయరామ్,సరిత హీరో,హీరోయిన్స్‌గా నటించారు.

ఇటివలే విలేకరుల సమావేశంలో ఈ విషయం తెలిపారు కూనిరెడ్డి శ్రీనివాస్. ఇందుకు సంబంధించిన కేసుపై స్పందించిన హైకోర్టు ఈ నెల 24లోగా ఈ రెండు సినిమాలపై రిపోర్ట్ ఇవ్వవలసిందిగా సంబంధిత ఫిలించాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, మరో బోర్డు సభ్యుడిని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మరియు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ కలిసి వివాదాస్పద చారుశీల, జూలీగణపతి చిత్రాలను చూసినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల వివాదం తొందరలోనే తేలనుంది.

Related

  1. రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!
  2. రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?
  3. రష్మీకి దిమ్మతిరిగే షాక్
  4. రష్మీకి ఎంత ఎక్కువిస్తే అన్ని అందాలు చూపిస్తుందట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -