అగ్రదర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ ప్రతిష్ఠాత్మక మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం కథాంశం ఉండబోతున్నట్టు టాక్. ఓ సిన్సియర్ ఐఏఎస్ అధికారి.. రాజకీయాల్లోకి వచ్చి సీఎంగా కావడం అతడు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతున్నదట.ఈ మేరకు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ మూవీకి మాటలు అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ పాత్రకు జగపతిబాబును తీసుకోబోతున్నట్టు టాక్. చెర్రీ ఫాదర్గా జగపతిబాబు చేయబోతున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ఇంకా కథా చర్చల స్థాయిలోనే ఉంది. చరణ్ ఆర్ఆర్ఆర్, ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక శంకర్ కూడా ఇండియన్ 2 పూర్తి చేయాల్సి ఉంది. ఈ తర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే చాన్స్ ఉంది.
ఏది ఏమైనా షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు హీరోలంతా పాన్ ఇండియా బాట పట్టారు. ఇప్పటికే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న పుష్పలో నటిస్తున్నాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ విడుదలైతే చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోతాడు. ఇక ఆ తర్వాత వచ్చే శంకర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం.
Also Read
చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!
అమీర్ఖాన్పై ఆరోపణలు.. స్పందించిన చిత్ర యూనిట్ ..!
అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!