Friday, May 3, 2024
- Advertisement -

సుహాసినికి మ‌ద్ద‌తుగా జ‌గ‌ప‌తి బాబు

- Advertisement -

దివంగ‌త న‌టుడు,టీడీపీ మాజీ ఎంపీ హ‌రికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ రాష్ట్రంలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆమె కూక‌ట్‌ప‌ల్లి నియోజిక వ‌ర్గం నుంచి పోటీ చేయ‌నున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె తప్ప విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.కొంద‌రు ఆమెను రాజ‌కీయంగా వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికి వ్య‌క్తిగ‌తంగా సుహాసినికి మ‌ద్ద‌తు నిలుస్తున్నారు. తాజాగా సినీ నటుడు జగపతి బాబు సుహాసినికి మద్దతు తెలిపారు.

‘సుహాసిని ఎంతో నిజాయితీ కలిగిన వ్యక్తి. ప్రజలను నిబద్దతతో సేవ చేయగలదని నేను నమ్ముతున్నాను. కూకట్ పల్లి అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న ఆమెను ఆ నియోజక వర్గ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నట్లు’ ఆయన వెల్లడించారు.అయితే ఆయ‌న త్వర‌లోనే టీడీపీ పార్టీలో చేరుతున్నార‌ని,అందుకే ఇలా సుహాసినికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -