Sunday, May 5, 2024
- Advertisement -

స్టేష‌న్‌లో లొంగిపోయిన ఎన్టీఆర్ డైర‌క్ట‌ర్‌!

- Advertisement -

జై లవ కుశ చిత్ర డైరెక్టర్ బాబి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఈ నెల 21న యాక్సిడెంట్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. 20వ తేదీ రాత్రి తమ కారును బాబీ ఢీకొట్టి వెళ్లిపోయాడని హైదరాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన హర్మీందర్ సింగ్ జుబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని….యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశారు.ఈ నెల 20న అమీర్ పేటకు చెందిన హర్మిందర్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో ప్రయాణిస్తున్నారు.

ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తోన్న బాబీ ….వారి కారును వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో హర్మిందర్ కారు పూర్తిగా ధ్వంసం అయింది. అయితే బాబీతోపాటు కారులోని ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి హర్మిందర్ తో మాట్లాడారు.తనకు న్యాయం చేయకుండానే బాబీ అక్కడ నుంచి వెళ్లిపోయారని కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని హర్మీందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాబీ బుధవారం రాత్రి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -