యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో… స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే చాలా కాలంగా రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అంటున్నారు.
కాకపోతే అది కన్ఫర్మ్ చేయడం లేదు. మూడేళ్లుగా రాజమౌళి బాహుబలి సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు టైం దొరకడం లేదు. అయితే ప్రస్తుతం రాజమౌళి బాహుబలి కంక్లూజన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో ఆయన తర్వాతి చిత్రంపై న్యూస్ బయటికి వచ్చింది. ఎన్టీఆర్ తో రాజమౌళి ఈ సారి జానపద చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వక్కంతు వంశీ చెప్పిన కథను సైతం పక్కన పెట్టారని టాక్. జనతా గ్యారేజ్ విజయానందంలో ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు విదేశాల్లో విహారానికి వెళ్లి వచ్చిన తర్వాత తన కొత్త సినిమా విశేషాలను వెల్లడిస్తారని అయన సన్నిహితులు చెబుతున్నారు.
Related