Tuesday, May 14, 2024
- Advertisement -

‘జనతా గ్యారేజ్’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది!

- Advertisement -

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సరసన సమంతా, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల శుక్రవారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రం ను మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబులో దుమ్ము రేపుతోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా కాన్సెప్టు ఎంత అద్భుతంగా ఉందో అర్థం అవుతోంది.

ఇందులో ఎన్టీఆర్ ఆనంద్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈ భూమితో పాటు ఈ భూమి మీద ఉన్న సృష్టి అన్నా ఆనంద్ కి ఎంతో ఇష్టం. చెట్లు, మొక్కులు, గాలి, నీరు వాటిని కాపాడు కోవడమే అని పని కూడా. అతని చెట్లంటే ఎంత ప్రాణమో… బుజ్జి(సమంత) అంటే కూడా అంతే ఇష్టం. ఎక్కడో ఇంకో చోట ఉండే పెద్ద మనిషి(మోహన్ లాల్) కి ఈ భూమి మీద ఉండే మనుషులంటే ఎంతో ఇష్టం. ఎదుటోడి కష్టం విని, కళ్లలో నీళ్లు తిరిగి గొంతులో ముద్ద దిగక పోవడం.. లాంటి క్యారెక్టర్ అతడిది.

సృష్టికి ఇద్దరినీ కలిపితే బావుండనిపించిందో ఏమో… మెక్కలతో పాటు ఈ భూమి మీద ఉన్న మనుషులను కూడా కాపాడితే ఈ భూమి ఇంకా అందంగా ఉంటుందని ఎన్టీఆర్ తో చెబుతాడు మోహన్ లాల్. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందంటూ పిలుస్తాడు. అతనితో చేతులు కలిపిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ద్వారా బలహీనులకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్నవారిని కాపాడుతుంటారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. పక్కా ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంటుందని అభిమానులు అంటున్నారు.

{youtube}v=7O4Hm070Bc8{/youtube}

Related

  1. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  2. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  3. బాల డైరెక్షన్ లో ఎన్టీఆర్!
  4. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -