యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంపై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటివలే రిలీజ్ అయిన గ్యారేజ్ ఫస్ట్లుక్తో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం గురించి అభిమానులకు రెండు సర్ప్రైజ్ వార్తలు బయటకు వచ్చాయి.
అయితే ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా జనతా గ్యారేజ్ టీజర్ కూడా రిలీజ్ చేయనున్నట్లు జనతా గ్యారేజ్ చేప్పినా, ఆ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాత్రం చెప్పలేదు. ఇక తాజాగా యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూన్ మూడోవారంలో గ్యారేజ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్నికి సంబంధించి ఓ పాట మినహా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.
ముందుగా చెప్పినట్లే ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగానూ జనతా గ్యారెజ్ సత్తా చాటుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.