అలనాటి అందాల తార, తెలుగు నాట అతిలోక సుందరి శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే ఈ నటి తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకున్నారు. అందులో అందాలు ఆరబోస్తూ మరింత రెచ్చిపోయింది జాన్వీ. ఇటీవల ఈ అమ్మడు రూహి అనే చిత్రంలో నటించగా, మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
చిత్ర ప్రమోషన్లో భాగంగా వెరైటీ లుక్స్లో ఫొటో షూట్స్ చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. రూహి చిత్రాన్ని దర్శకుడు హార్దిక్ మెహతా తెరకెక్కించారు. గతంలో కూడా జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి.
రూహిలో వరుణ్ శర్మ, పంకజ్ త్రిపాఠి, అలెక్స్ ఓనెల్, సీమా పహ్వా, ఆమ్నా షరీఫ్, రోనిత్ రాయ్ లు కీలక పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఈ చిత్రం కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా.. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది.
కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం..!
మళ్ళీ తెర పైకి భైంసా.. ఆ ఎంపీ హౌజ్ అరెస్ట్..!
ఏపిలో ఎమ్మెల్సీలు ఆరుగురు ఏకగ్రీవం.. మండలిలో పెరిగిన వైసీపీ బలం!