నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన జాతిరత్నాలు సినిమా దుమ్మురేపుతోంది. థియేటర్లను షేక్ చేస్తూ.. రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ.. కాసుల వర్షం కురిపిస్తున్నది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్గా జాతిరత్నాలు సినిమా అదరగొడుతోంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాలు మాదిరిగా వసూళ్లు రాబడుతోంది.
అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఇందులో నటించారు. మహాశివ రాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతోంది. దీంతో అదిరిపోయే కలేక్షన్లు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది.
మొదటి రోజుతో పాటు రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ షేర్ ను సాధించింది. రెండో రోజు ఏకంగా 2.8 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమాను మొత్తం 11 కోట్ల రూపాయలకు అమ్మగా 11.5 కోట్ల టార్గెట్తో బరిలో దిగింది. అయితే, ఇప్పటికే 8.86 కోట్ల రూపాయల రాబట్టింది. మరో 2.64 కోట్ల రూపాయల షేర్ అందుకుంటే రికార్డులు బ్రేక్ చేసినట్టేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడానికి మంచి కథాంశంతో పాటు ఇందులో అద్భుతంగా నటించిన నటీనటులు కారణమని చిత్ర యూనిట్ పేర్కొంది.
అమితాబ్, చిరు కాంభినేషన్ లో మరో మూవీ !
అందరూ కుదేలైతే అదాని సంపద ఎలా పెరిగింది? : రాహుల్ గాంధీ
‘ఆర్ఆర్ఆర్’ నుంచి మార్చి 15న అలియా ఫస్ట్ లుక్ రిలీజ్