దేవి శ్రీ ప్రసాద్.. భారత సినీ సంగీత ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు. శాస్త్రీయ సంగీత కుటుంబానికి చెందిన దేవి శ్రీప్రసాద్.. దేవీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా సూపర్ హిట్ బాణీలతో సినీ సంగీత ప్రియులను అలరించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలతో పాటు పలు దక్షిణాది సినిమాలకు బాణీలు స్వరపరిచారు.
ఈ క్రమంలోనే అగ్రశ్రేణి సంగీత దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు. అదే జోరులో ముందుకు సాగుతూ ఎప్పుడు బిజీగా ఉంటాడు. అందుకనే అగ్ర నిర్మాతలు, దర్శకులతో పాటు హీరోలు వారి సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించాలని కోరుకుంటారు. అయితే ఇప్పటివరకు వెండితెరతో పాటు పలు ప్రత్యేక స్టేజ్ షోలలో దుమ్ము రేపిన ఈ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. బుల్లితెరపై కూడా తన సత్తాను చూపించడానికి సిద్ధమవుతున్నాడు.
ఈ సారి బుల్లితెరపై ఓ ప్రత్యేక షో చేయడానికి సిద్దమయ్యాడు. జీ తమిళ్ అనే ఛానెల్ తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ బుల్లితెర షో పేరు “స్టార్ టూ రాక్ స్టార్”. ఈ షోకు సంబంధించిన ప్రోమోను జీ తమిళ్ ఛానెల్ తాజాగా విడుదల చేసింది. సినిమాల్లో తన సంగీతంతో.. స్టేజ్ షోలలో తన ఎనర్జిటిక్ ఫెర్ఫామెన్స్ తో దుమ్మురేపే ఈ రాక్ స్టార్ బుల్లితెరపై ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి మరి !!
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కృతిశెట్టి రోమాన్స్ !
అరటి తొక్కతో ఇన్ని ప్రయోజనాలున్నాయా !
మెరిసే ముఖ సౌందర్యం కోసం.. ఈ చిట్కాలు !