Sunday, April 28, 2024
- Advertisement -

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్‌కు కరోనా

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజూ మూడు లక్షల కేసులు నమోదు అయ్యాయంటే కరోనా ప్రభావం ఎంతగా ఉందో ప్రత్యకంగ చెప్పక్కరలేదు. కరోనా వల్ల ఇప్పుడు సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రెటీలు కూడా హడలి పోతున్నారు. వరుసగా కరోనా భారిన పడి విల విలలాడుతున్నారు. మరికొంత మంది కన్నుమూశారు. తాజాగా టాలీవుడ్ లో వరుసగా కరోనా భారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ కి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.

స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో బుధవారం తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ నిర్థారణ అయిందని క‌ళ్యాణ్ దేవ్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్నవారు విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ తేలితే కచ్చతంగా చికిత్స చేయించుకోవాలని ఆయన కోరారు.

ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. మెగా అభిమానులు, సన్నిహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం క‌ళ్యాణ్ దేవ్‌ సూప‌ర్ మ‌చ్చి, కిన్నెర సాని అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో నాగబాబు, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ తదితరులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

ఆ కింగ్ కోబ్రా చూస్తే గుండె గుభేల్..

పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్

ఆ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చలేదట.. అందుకే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -