అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో అందాలు ఆరబోస్తూ యువత మనసులు దోచుకుంటుంది. శ్రీదేవి మరణం తర్వాత జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు నటిగా తన సత్తా చాటుకునేందుకు నానా తంటాలు పడుతుంది. అయితే సినిమాల్లో కన్నా సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే జాన్వీ తాజాగా తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
రూహి సినిమా ప్రమోషన్ అంటూ అప్పుడు వెరైటీ డ్రెస్లలో అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్ చేసిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మాల్దీవుస్ వేదికగా అదరగొడుతుంది. తాజాగా మాల్దీవుల కోసం వెకేషన్లో భాగంగా వెళ్లిన జాన్వీ అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ హాట్ హాట్గా ఫొటో షూట్స్ చేసింది.
ఈ ఫొటో షూట్స్ చాలా హాట్ హాట్గా ఉండడంతో నెటిజన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘ఘోస్ట్ స్టోరీస్’లో జాన్వీ నటిస్తోంది. ‘గుడ్ లక్ జెర్రీ’, కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ‘తఖ్త్’, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘దోస్తానా 2’ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.