అతిలోక సుందరి శ్రీదేవి ఎంత ఫేమస్ అయిందో ఆమె కూతరు జాహ్నవి కూడా అంతే ఫేమస్ అయింది. ఇంకా చెప్పాలంటే అన్ని సినిమాలు చేస్తే శ్రీదేవకి అంతటి ఇమేజ్ వచ్చింది. జాహ్నవి ఇంకా ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే , శ్రీదేవి కంటే ఎక్కువే ఫేమస్ అయిందనే చెప్పాలి. దీనికి కారణం ఆమె తల్లి శ్రీదేవి అనే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు.శ్రీదేవి వెళ్లే ప్రతి ఫంక్షన్కు జాహ్నవిని తీసుకువచ్చేది. దాని ద్వారా మీడియాకు బాగా సుపరిచితురాలయింది జాహ్నవి.
శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నా ఫోకస్ మొత్తం జాహ్నవి మీదే ఉండేది.శ్రీదేవి కూడా జాహ్నవిని హీరోయిన్గా చూడాలని కొరిక ఉండేది. కాని ఆ కొరిక తీరకుండానే శ్రీదేవి హఠాత్తుగా మరణించింది.అయితే శ్రీదేవి మరణం తరువాత జాహ్నవి మళ్లీ వార్తల్లో నిలిచింది.ఓ ప్రముఖ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఫోటో షూట్లో జాహ్నవి స్టీల్స్ చూసి బాలీవుడ్ జనాలు విస్తుపోతున్నారు.జాహ్నవి ఓ రేంజ్లో అందాల ప్రదర్శన చేసింది.
ఆ అరకొర డ్రస్లలో జాహ్నవిని చూసే సరికి కుర్రకారుకి నిద్ర పట్టడం లేదు.ఈ ఫోటోలను కొంతమంది ఆమెపై విమర్శలకు దిగుతున్నారు. తల్లి మరణిచిందని భాద లేకుండా జాహ్నవి ఇలా చేయడం ఏంటీ అనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమె గ్లామర్ ఫీల్డ్లో ఉంది.ఇలాంటివి సర్వసాధారణం అని జాహ్నవికి సపోర్టు చేస్తున్నారు.