Sunday, May 19, 2024
- Advertisement -

జ‌క్క‌న్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ బ‌డ్జెట్ కెవ్వు కేక‌

- Advertisement -

టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు కాస్త తక్కువే. అదీ పెద్ద హీరోలు కలిసి సినిమా చేయడమంటే చాలా రేర్ అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పేరును ప్రపంచవ్యాప్తంగా వినిపించిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రెస్టీజియస్ మల్టీ స్టారర్ తో తెలుగులో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.

జ‌క్క‌న్న దర్శకత్వంలో ఒక భారీ మల్టీస్టారర్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనుల్లో రాజమౌళి బిజీగా వున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. కథానాయికల అన్వేషణ కొనసాగుతోంది. అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించాలనే ఆలోచనలో వున్నారు.

రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ కాస్టింగ్ పరంగానే కాదు.. బడ్జెట్ పరంగానూ భారీ చిత్రమే. ఈ సినిమా బడ్జెట్ ఎక్కువే ఉంటుందనే టాక్ ముందు నుంచే వినిపించినా ఏ రేంజిలో ఉంటుందనే దానిపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చింది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని మూవీ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య క్లారిటీ ఇచ్చాడు.

తనతో పాటు ఇతర టెక్నీషియన్స్ కి రాజమౌళి కథ చెప్పారనీ, ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని అన్నారు. బలమైన కథాకథనాలు .. భారీతనం .. ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలవనున్నాయని చెప్పారు.

ఓ సినిమాకు రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టడం సామాన్యమైన విషయమేం కాదు. కానీ అంతమొత్తం పెట్టడానికి ప్రొడ్యూసర్ రెడీ అంటున్నారంటే అది రాజమౌళి మీద ఉన్న నమ్మకమేని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -