Monday, May 6, 2024
- Advertisement -

ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ వచ్చేసింది..

- Advertisement -

కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఈ సినిమాకకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఇంగ్లీష్ లిరిక్స్ తో గ్లింప్స్ ని నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ..ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చుసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.

గ్లింప్స్ చూస్తుంటే పైరేట్స్ నేపథ్యంతో సాగే కథ అని అర్ధమవుతుంది. గ్లింప్స్ లో ఒక పెద్ద షిప్‌లో ఉన్న కంటైనర్స్ ని దేవర జనం దొంగతనం చేయడం కనిపిస్తుంది. ఎన్టీఆర్ చాలా వైల్డ్ గా కనిపించారు. నువ్వు ఎప్పుడు సముద్రాన్ని తాకలేదు. నువ్వు ఎప్పుడు నాతో ఆడలేదు. నేను ఎప్పుడు నీ పై దయ చూపించను. నిన్ను నేను బ్రతకనివ్వను. నీ రక్తాన్ని ఏరులయ్యి పారిస్తాను చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.

రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్‌ లో ప్రేక్షకుల ముందుకురానుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనిపించనున్నారు. అనిరుథ్ సంగీతం అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -