Friday, April 26, 2024
- Advertisement -

డేర్ చేస్తున్న ఎన్టీఆర్.. కరోనా అంటే భయం లేదా?

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ వెండితెరపై హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షో హోస్ట్ గా వ్యవహరించడంతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ఎన్టీఆర్ మరోసారి సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

జెమినీ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న “ఎవరు మీలో కోటీశ్వరుడు”ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు మనకు తెలిసిందే.అయితే ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది.

Also read:అతనితో ఒకే బెడ్ పై అలా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఫోటో వైరల్!

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమ నిర్వాహకులకు అభ్యంతరం లేకపోతే కరోనా జాగ్రత్తలను పాటిస్తూ షో నిర్వహిద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. కానీ షో నిర్వాహకులు మాత్రం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ షోపై వాయిదా వేయడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వివిధ కార్యక్రమాలు, పలు టీవీ సీరియల్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోయినా వచ్చే నెలలో ఈ షోను ప్రారంభించాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also read:ప్రేమలో పడిన యాంకర్ వర్షిని.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -