మరో ఐదు రోజులో షూటింగ్ మొదలు కానుంది. కానీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ మాత్రం తగ్గలేదు. ఒళ్లు తగ్గించి తన న్యూ మూవీ జై లవ కుశ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందె. కానీ, ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ ఎప్పటిలాగే మామూలుగా కనిపించాడు.
ఎన్టీఆర్ హీరోగా.. బాబీ దర్శకత్వంలో.. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజే ప్రారంభం అయ్యింది. వినాయక్, హరికృష్ణ తదితరులు ఈ మూవీ ప్రారంబోత్సవానికి హాజరయ్యారు. టెంపర్ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా ఫిట్ గా కనిపించారు. అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో పర్వాలేదు అనిపించాడు. జనతా గ్యారేజ్ సినిమా కోసం ఒళ్ళు పెంచాడు. ఇప్పుడు అదే ఫిజిక్ని మెయిన్టెయిన్ చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కోసం మూడు డిఫరెంట్ గెటప్స్లో ఎన్టీఆర్ కనిపించనున్నడనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇందుకోసం ఎన్టీఆర్ గట్టిగా కసరత్తులు చేస్తున్నడని.. ఒళ్ళు కూడా తగ్గిస్తున్నాడని గుస గుసలు వినిపించాయి. కాని అదంతా ఇప్పుడు ఉత్తదేనని తెలిపోయింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రాశి ఖాన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మరో ఇద్దరి హీరోయిన్స్ కోసం వేట కొనసాగుతోంది. మొత్తం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.
Related