జనతా గ్యారేజ్ చిత్రం విడుదల అయి ఐదు నెలలు అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గడ్డాన్ని తీయడం లేదు. అదే లుక్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. అసలు అదే లుక్ మెయిన్ టైన్ చేయడానికి కారణాలు ఏంటో.. ఇప్పుడూ బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఎన్టీఆర్ 27 సినిమాని బాబీ డైరక్ట్ చేయనున్నారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒక పాత్ర పూర్తిగా గడ్డం లుక్ తో ఆకట్టుకోనున్నట్లు సమాచారం. మిగిలిన రెండు పాత్రలు క్లాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘జై లవకుశ’ అనే పేరును పరిశీలిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 11 న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఆ తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు.
ఇక ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో ఒకరిగా ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా ఫిక్స్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత చాలా కథలు విని ఈ సినిమాని ఒకే చేసాడు ఎన్టీఆర్. సో ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
Related