Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వ‌స్తున్నాడు …మ‌రి రాంచ‌ర‌ణ్‌

- Advertisement -

మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్‌ అనే నేను’ షూటింగ్ పూర్తి చెసుకుని ప్రీరీలిజ్ ఫంక్ష‌న్‌కు రెడీ అవుతుంది. ఈ రోజు (శనివారం) సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. మొద‌ట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హీరో ఎన్టీఆర్,రాంచ‌ర‌ణ్ హాజరు కాబోతున్నారనే వార్తలు చ‌క్క‌ర్లు కొట్టాయి.వాస్తవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ ప్రి రిలీజ్ పంక్షన్ కు వస్తారని అంతా భావించారు. కాని చిత్ర యూనిట్ మ‌హేష్ బాబు ప‌క్క‌న ఎన్టీఆర్ ఫోటోని సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. దీనిబట్టి చూస్తే రాంచ‌ర‌ణ్ రావ‌ట్లేద‌ని తెలుస్తుంది.

ఎన్టీఆర్ ఒక్క‌రే ముఖ్య అతిథిగా రాబోతున్న‌ట్లుగా తెలుస్తుంది.సాధార‌ణంగా మ‌హేష్ త‌న సినిమా ఫంక్ష‌న్స్‌కి గెస్ట్‌లుగా ఎవ‌రిని పిల‌వ‌రు.కాని ‘భరత్‌ అనే నేను’ సినిమా కోసం ఫ‌స్ట్‌టైం వేరే హీరోని త‌న ఆడియో ఫంక్ష‌న్‌కు పిల‌వ‌డం జ‌రుగుతుంది. నటి కైరా అడ్వాణీ ‘భరత్‌ అనే నేను’లో హీరోయిన్‌గా చేస్తుంది.డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఏప్రిల్‌ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -