కాజల్ అగర్వాల్ ఏజ్ పెరిగినా టాలీవుడ్ లో క్రేజ్ తగ్గని హీరోయిన్. వరుస పెట్టి సినిమాలు చేయకపోయిన ఏదో రకంగా తెలుగు సినిమాలు చేస్తు అభిమానులను అలరిస్తుంది.ఈ అమ్మడు కుర్ర హీరోల నుండి టాప్ హీరోల పక్కన హీరోయిన్గా చేసింది.ఇప్పుడు మరో సినిమా ఓకే చేసింది కాజల్.టాలీవుడ్ చందమామ తాజాగా మరోసారి రవితేజతో జోడీ కట్టబోతోంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మైత్రీ మేకర్స్ నిర్మించే మూవీలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకున్నారు. రవితేజతో కాజల్ కలిసి నటించడం ఇది మూడోసారి. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో సారొచ్చారు.. వీర సినిమాలు వచ్చాయి.
అయితే ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రవితేజ ప్రస్తుతం చేస్తున్న నేలటిక్కెట్ షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా షూట్ లో జాయినయ్యే అవకాశముంది. తమిళంలో హిట్ కొట్టిన ‘తెరి’ మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ కథను సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.మరి ఈసారయినా వీరి కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.