టాలీవుడ్ కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్ సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్న విషయం తెలిసిందే. గౌతమ్ కిచ్లూతో కాజల్ అక్టోబర్ 30న ఏడడుగులు వేయనుంది. కోవిడ్ నేపథ్యంలో అతి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు నడించింది. అయితే ప్రస్తుతం ఆమె మెగాస్టార్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 లో నటిస్తుంది.
రెండు వారాలు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు మళ్లీ షూటింగ్స్ కి సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లో నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఈ సినిమా మేజర్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో షూటింగ్ నిమిత్తం భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ హైదరాబాద్కు రానుందని తెలిసింది. మరోవైపు షూటింగ్లో పాల్గొనడంతో పాటు ఇక్కడ టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ కూడా ఇవ్వాలని ఆలోచిస్తోందట. ‘ఆచార్య’ షూటింగ్కు ప్యాకప్ చెప్పిన తర్వాత ఆమె హనీమూన్కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటోందని తెలిసింది.
ఆచార్య వచ్చే అసలు ట్విస్ట్ ను బయటపెట్టిన నిహారిక..!
గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?